వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసత్యసాయి జిల్లా తమ్మడేపల్లి చెరువు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపిస్తూ గొర్రెల కాపర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వెయ్యికి పైగా గొర్రెలు, మేకలను అక్కడికి తీసుకెళ్లి సమస్యను వివరించారు.
చెరువు భూముల్లో పంటలు సాగు చేయడంతో జీవాలకు మేత దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హనుమంతు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

