Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు నిర్మాణం వద్దంటూ కాసింపల్లి వాసుల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 6:20 PM హన్మకొండ General
రోడ్డు నిర్మాణం వద్దంటూ కాసింపల్లి వాసుల నిరసన - Udayam
కమలాపూర్‌ నుంచి కాసింపల్లి మీదుగా హెచ్‌పీసీఎల్‌ వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి మంజూరు కావడంతో కాలనీవాసులు నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని డిమాండ్‌ చేశారు. డబుల్‌ రోడ్డు నిర్మిస్తే గ్యాస్‌, ఇతర వాహనాలు కాలనీలోకి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, చిన్నారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.

Comments

G
Loading comments...