వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ 22వ వార్డు శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీపై పూర్తిస్థాయిలో స్లాబ్ వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కాలనీవాసులు నిరసన చేపట్టారు. బీజేపీ పట్టణ జనరల్ సెక్రటరీ జగదీశ్ ఆధ్వర్యంలో లక్ష్మీ వాటర్ ప్లాంట్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
డ్రైనేజీపై వెంటనే పూర్తిస్థాయిలో స్లాబ్లు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

