వార్తలకు తిరిగి వెళ్లండి

సామాన్యుల ఆస్తుల రక్షణ ప్రభుత్వ బాధ్యతని, న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22ఏ నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములు చేరడంలో సాంకేతిక పొరపాట్లు జరిగాయని చెప్పారు.
సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, 15 రోజుల్లో దరఖాస్తులను పరిశీలిస్తుందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఇప్పటికే పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

