వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ మండలం ఖాజీ రామారంలోని సీతాఫల చెరువు కట్ట మైసమ్మ వద్ద గండిపడి తీవ్రంగా కోతకు గురై ప్రమాదకరంగా మారిందని రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చెరువు నీటి భద్రతపై ఆందోళన నెలకొంది.
గతంలో ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పరిశీలించడమే తప్ప మరమ్మతులు చేపట్టలేదని వారు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి కట్టకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

