వార్తలకు తిరిగి వెళ్లండి

వీణవంక మండలం బేతిగల్ ఊరుచెరువు మత్తడి వద్ద కల్వర్టు దెబ్బతినడంతో వర్షం పడితే నీరు చేరి ప్రమాదకరంగా మారుతోంది. పెద్ద గుంతలు ఏర్పడటంతో జగ్గయ్యపల్లి, జమ్మికుంట వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రివేళ గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

