వార్తలకు తిరిగి వెళ్లండి

దోమకొండ నుంచి సంగమేశ్వర గ్రామానికి వెళ్లే మార్గంలోని ఎడ్లకట్ట వాగుపై నిర్మించిన బ్రిడ్జి సైడ్వాల్ పూర్తిగా విరిగిపోయి ప్రమాదకరంగా మారింది.
నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగానే సైడ్వాల్ దెబ్బతిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగితే వాహనాలు వాగులో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పరిశీలించి సైడ్వాల్ను పునరుద్ధరించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

