Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు - పోలీసులకు వారధిగా యువత నిలవాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 2:54 PM విజయనగరంGeneral
ప్రజలు - పోలీసులకు వారధిగా యువత నిలవాలి - Udayam
యువత ప్రజలు - పోలీసుల మధ్య వారధులుగా పనిచేస్తూ గ్రామాల్లో గంజాయి, మద్యం, జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌, సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ సూచించారు. మంగళవారం గజపతినగరం సర్కిల్‌ పరిధిలో నిర్వహించిన యువ చైతన్యం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, యువతతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా, రహదారి భద్రతపై చైతన్యం తీసుకురావాలని యువతకు సూచించారు.

Comments

G
Loading comments...