Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 30, 2026 12:06 PM మంచిర్యాలతెలంగాణ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam Digital
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానిక తాసిల్దార్ బక్కన్న సూచించారు. గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ జన్నారం మండలంలో అన్ని గ్రామాలలో అతి భారీ వర్షం నమోదవుతుందని తెలిపారు. దీంతో వాగులు, వంకలు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ఆయన వెల్లడించారు.. భారీ వర్షం నేపథ్యంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, గోదావరి నదితో పాటు వాగులు, వంకర వైపు ప్రజలు వెళ్ళవద్దని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...