వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. జన్నారం గ్రామంలోని రాజీవ్ నగర్ కాలనీలో సోమవారం రాత్రి పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 11 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అపరిచితుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, స్థానిక ప్రజలు ఉన్నారు.
Comments
Loading comments...

