Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలి: బీజేపీ మండల అధ్యక్షుడు నాగం శివకుమార్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 10, 2026 4:44 PM జగిత్యాలGeneral
ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలి: బీజేపీ మండల అధ్యక్షుడు నాగం శివకుమార్ - Udayam
భీమారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగం శివకుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి హాజరై మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి బూత్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...