వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆముదాలవలస మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ అన్నారు.
స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై 10కి పైగా వినతులు స్వీకరించారు. అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

