వార్తలకు తిరిగి వెళ్లండి
రొమేనియాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేటి నుంచి రెండు రోజుల పాటు రొమేనియాలో పర్యటించనున్నారు. మోల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజే ఆమె రొమేనియా చేరుకోనున్నారు.
పర్యటనలో రొమేనియా అధ్యక్షుడు నికుషోర్ డాన్, ఇతర కీలక నేతలతో భేటీ అవుతారు. అలాగే ఇండియా-రొమేనియా బిజినెస్ ఫోరమ్లో ప్రసంగించి, భారతీయ సమాజంతో మాట్లాడతారు.
Comments
Loading comments...