వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. పాఠశాలలో అమలు చేసే మధ్యాహ్న భోజన కార్యక్రమంలో కూరగాయలు వినియోగించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల ఆవరణలో పలు రకాల కూరగాయల మొక్కలను నాటారు. అవి ప్రస్తుతం పెరిగే దశలో ఉన్నాయి. విద్యార్థులకు కూరగాయల సాగుపై అవగాహనతో పాటు పాఠశాలకు ఉపయోగపడే విధంగా కూరగాయల మొక్కలు పెంచుతున్నామని హెచ్ఎం బుచ్చయ్య తెలిపారు.
Comments
Loading comments...
