వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దశంకరంపేట 132/33 కేవీ ట్రాన్స్కో సబ్స్టేషన్లో మరమ్మతు పనుల కారణంగా రేగోడ్ మండలంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ నర్సింలు తెలిపారు.
వినియోగదారులు అత్యవసర అవసరాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సరఫరా నిలిపివేత సమయంలో ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.
Comments
Loading comments...

