వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. ఆదివారం సాయంత్రం 20 గేట్లు ఓపెన్ చేసి దిగువకు వంశధార నదిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు.
వంశధార ఇన్ఫ్లో 19,500, డౌన్ఫ్లో 27,487 క్యూసెక్కులుగా నమోదైందని డీ ఈ సరస్వతి తెలిపారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ఆయా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

