వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట పట్టణంలో డ్యూటీకి వెళ్తున్న పోలీసులకు పాఠశాల విద్యార్థులు రాఖీలు కట్టి మురిసిపోయారు. రక్షాబంధన్ ను పురస్కరించుకొని గురువారం పట్టణంలో విధులలో ఉన్న కానిస్టేబుల్ రాజు, హోంగార్డ్ మొగిలికి వారు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలీసులు స్వీట్లు కొనిచ్చి అభిందించారు.
అందరి రక్షణ కోసమే పోలీసులు పని చేస్తున్నారని వారు అన్నారు. రాఖీ పౌర్ణమిని సంతోషంగా జరుపుకోవాలని వారు సూచించారు.
Comments
Loading comments...

