వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అపహరణకు గురై మూడు నెలలు గడుస్తున్నా ఆచూకీ కనిపెట్టకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం పోలీసుల పూర్తి వైఫల్యమేనని మండిపడింది.
దర్యాప్తును స్థానిక పోలీసులకే అప్పగించాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా, ఎస్పీ, ఎస్హెచ్ఓలపై తమకు నమ్మకం లేదని కోర్టు స్పష్టం చేసింది. అపహరణకు గురైన బాలికను గురువారం తమ ముందర హాజరుపరచాలని డీజీపీని ఆదేశించింది.
Comments
Loading comments...

