వార్తలకు తిరిగి వెళ్లండి
విజయనగరంలో పోలీసు వ్యాన్ బోల్తాపడింది. ఆదివారం మధ్యాహ్నం గాజులరేగ కొండ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందినట్లు సమాచారం.
కొండకరకాం కేసు దర్యాప్తు నిమిత్తం రూరల్ ఎస్ఐ అశోక్తో పాటు పలువురు పోలీసులు వ్యాన్లో వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ఎస్ఐతో పాటు పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

