వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామివారి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వేణుగోపాల స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య పంచామృతాభిషేకం చేసి, శుద్ధ జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు.
అనంతరం తులసిమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ, ఫలాలను సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

