వార్తలకు తిరిగి వెళ్లండి

వై.రామవరం మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో వసతులను పరిశీలిస్తున్నట్లు ఎంపీడీవో బాపన్నదొర మంగళవారం తెలిపారు. మొత్తం 154 కేంద్రాలు ఉండగా, ఇప్పటివరకు 102 కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.
విద్యుత్, మరుగుదొడ్లు, ప్రహరీ వంటి సౌకర్యాలు లేని కేంద్రాలను గుర్తించి, అనువైన భవనాల్లోకి మార్చేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

