వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు విరాట్ కోహ్లీ వంటివారని మంత్రి లోకేష్ కొనియాడారు. బౌలర్లు మారినా బ్యాటర్ మాత్రం ఆయనేనని, ప్రత్యర్థులు ఎవరైనా సరే చంద్రబాబు సిక్సర్లు కొట్టడం ఖాయమని లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన కూటమి విజయోత్సవ సభలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమను 'రాయల్ సీమ'గా మారుస్తున్నది చంద్రబాబేనని లోకేష్ పేర్కొన్నారు. కియా, రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి సంస్థలను తీసుకురావడంతో పాటు, హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా సీమకు సాగునీరు అందించి, లక్ష కోట్లతో 'మిషన్ రాయలసీమ'ను బాబు ప్రారంభించారని ఆయన వివరించారు.
Comments
Loading comments...

