Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడూరులో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:23 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కోడూరులో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం - Udayam
జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో గురువారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నట్లు సీఐ కిషోర్‌బాబు తెలిపారు. సైబర్‌ నేరాలపై ప్రజలు పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ నేరాల్లో చిక్కుకోవద్దని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...