వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినేపల్లి మండలం ఇప్పలతండాలో ఈనెల 15న జరిగిన చిట్టెమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ శ్రీనివాసులు భూమిని దక్కించుకునే ఉద్దేశంతో కేతావత్ హీరమ్మ హత్యకు పథకం రచించినట్లు తెలిపారు.
చిట్టెమ్మను కత్తితో హత్య చేసి వెండి కడియాలు, కాళ్ల పట్టీలు తీసుకెళ్లినట్లు తెలిపారు. విచారణలో హీరమ్మ హత్యకు పాల్పడినట్లు అంగీకరించిందని, ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

