వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద పోలీసుల కారులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, యూనిఫాంలు కనిపించడం కలకలం రేపింది. మద్యం మత్తులో కారు డ్రైవర్ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు.
కారులో ఇద్దరు ఎస్సైలు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేత అశోక్కుమార్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

