Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పందలపాకలో కట్లమ్మ తల్లికి కుంభాభిషేకం

Follow Udayam Digital on Google
devendra Jul 28, 2026 2:12 PM తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్
బిక్కవోలు మండలం పందలపాక కట్లమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మంగళవారం పురస్కరించుకుని మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. వేలంపేట శ్రీ సీతారామ భజన మండలి ఆధ్వర్యంలో మహిళలు తుల్యభాగ తీరం నుంచి గోదావరి జలాలను తెచ్చి, భాజాభజంత్రీల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంభాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కొమరిపాలెం, తోసిపూడి, రాయవరం తదితర గ్రామాల భక్తులు విశేషంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...