వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి రోజున ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పాత పోస్టాఫీస్ సెంటర్ వద్ద ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మండలంలోని పోచారం గ్రామానికి చెందిన సట్టు శ్రీను (48) అక్కడికక్కడే మృతిచెందారు.
ఆయనతో పాటు బైక్ పై వెళ్తున్న కుమార్తె తీవ్రంగా గాయపడింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

