వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళవారం కలిశారు.
నియోజకవర్గంలోని గ్రామాల్లో సుమారు 157 కి.మీ. మేర నూతన బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.163 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే నియోజకవర్గంలోని పెండింగ్ పంచాయతీరాజ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

