Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లఖిసరాయ్‌ తొక్కిసలాట బాధితులకు పీఎం సాయం

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 6:06 PM ఆల్ ఇండియా జాతీయ
లఖిసరాయ్‌ తొక్కిసలాట బాధితులకు పీఎం సాయం - Udayam
బిహార్‌లోని లఖిసరాయ్‌ అశోక్‌ ధామ్‌ ఆలయంలో తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి సాయం అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బిహార్‌ సీఎం సమ్రాట్‌ చౌధురి కూడా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తొక్కిసలాటపై ప్రధాని విచారం వ్యక్తం చేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...