వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగి మండలం పినపెంకి గ్రామంలో ఎస్ఐ సూర్యకుమారి బుధవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సైబర్ మోసాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, యువత భద్రతకు సహకరించాలని సూచిస్తూ, నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.
Comments
Loading comments...

