వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణమాసం సందర్భంగా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలోని కాలికాదేవి ఆలయంలో బోనాల మహోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. మహిళలు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని ప్రదర్శనగా, ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు.
బోనాల నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు చీర సారెలతో మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

