వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెడంగొ గ్రామంలో ఆదివారం సాయంత్రం పొలంలో కూలి పనులు చేస్తుండగా పిడుగు పడింది. ఘటనలో కట్టా సుముద్రి, సవర జొరా అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.
క్షతగాత్రులను హరిపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో బొయా పెర్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Comments
Loading comments...
