వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో గతంలో కేటాయించిన 9.09 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతినిచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవారం జీవో నంబర్ 588ను జారీ చేసింది.
అసైన్డ్ భూముల హక్కులపై రెండేళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు ఊరట లభించింది. పరిశీలన పేరిట నిలిపివేసిన ప్రక్రియను తాజాగా పునరుద్ధరించారు.
Comments
Loading comments...

