వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.65 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

నెల రోజుల వ్యవధిలో సీఈఐఆర్ వ్యవస్థ ద్వారా రూ.65 లక్షల విలువైన 236 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీతా రెడ్డి శుక్రవారం పోలీసు కార్యాలయంలో బాధితులకు ఆ ఫోన్లను అందజేశారు.
వివిధ రాష్ట్రాల నుంచి పోగొట్టుకున్న ఫోన్లను ప్రత్యేక బృందాల సహాయంతో రికవరీ చేశామని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 500 ఫోన్లను బాధితులకు అప్పగించామని పేర్కొంటూ, ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు.
Comments
Loading comments...