వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హైకోర్టు ప్రాసెస్ సర్వర్ పరీక్షల నేపథ్యంలో ఆగస్టు 29న జరగాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ పీజీ రెండో సెమిస్టర్ పరీక్షను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ కట్ల తెలిపారు. వాయిదా పడిన పరీక్షను సెప్టెంబర్ 2న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాలు, సమయాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మిగతా పీజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని తెలిపారు.
Comments
Loading comments...

