Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దెందులూరులో వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 10:36 AM ఏలూరుGeneral
దెందులూరులో వాహనం ఢీకొని వ్యక్తి మృతి - Udayam
దెందులూరు మండలానికి చెందిన పసల దుర్గారావు (36)ను మంగళవారం రాత్రి గుండుగొలను సెంటర్‌ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మృతదేహం ఛిద్రమైంది. దెందులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...