వార్తలకు తిరిగి వెళ్లండి

బోనకల్లు రైల్వే ఓవర్ బ్రిడ్జి దిగువన జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవిందాపురం(ఎల్)కు చెందిన మందా సత్యానందం(35) మృతి చెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

