వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లి మున్సిపాలిటీలో అర్ధరాత్రి భవనంపై నుంచి ప్రమాదవశాత్తు పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఓ అపార్ట్మెంట్లో చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కేకలు వేయడంతో రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు.
ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

