Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి ఫోటోల క్యాప్చర్

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 3:54 PM కామరెడ్డిGeneral
జుక్కల్ మండలంలోని పలు గ్రామాల్లో కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటింటికి తిరుగుతూ ఫోటోలు క్యాప్చర్ చేస్తున్నామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. రెండు రోజులుగా ఆరుగురు మండల స్థాయి అధికారులు దరఖాస్తుదారుల వివరాలు విచారించి ఫోటోలు క్యాప్చర్ చేస్తున్నామన్నారు. అందుబాటులో లేని పెన్షన్ దరఖాస్తుదారులు జీపీ కార్యదర్శులకు సంప్రదించాలని సూచించారు. మండలం మొత్తం మీద 105 మందికి ఫోటోలు తీశామన్నారు.

Comments

G
Loading comments...