వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలంలో చేయూత పెన్షన్ల పరిశీలన వేగంగా సాగుతోంది. ఆసరా కోరుతూ వివిధ వర్గాల నుంచి మొత్తం 637 దరఖాస్తులు అందాయి. వితంతువులు 340, దివ్యాంగులు 235, ఒంటరి మహిళలు 52 మందితో పాటు 10 మంది గీత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు.
అధికారులు ప్రస్తుతం ఆన్లైన్ డేటా నమోదు ప్రక్రియను ముమ్మరం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ప్రయోజనం చేకూరేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

