వార్తలకు తిరిగి వెళ్లండి
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో పార్వతీపురం కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. బియ్యం, పంచదార, బెల్లం, ఉల్లి, పప్పులు, వంట నూనె వంటి నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పేదలపై భారం పడుతోందని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలన్నారు.
అలాగే రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

