Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేరేచర్లలో శిథిలావస్థకు చేరిన ఇళ్లు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 8:43 PM గుంటూరుGeneral
పేరేచర్లలో శిథిలావస్థకు చేరిన ఇళ్లు - Udayam
మేడికొండూరు మండలం పేరేచర్లలో ప్రభుత్వం నిర్మించిన కాలనీ ఇళ్లు కూలిపోయే దశకు చేరాయని సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ విమర్శించారు. మౌలిక వసతులు బొత్తిగా లేకపోవడంతోనే లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ముందుకు రావట్లేదని తెలిపారు. బుధవారం సీపీఎం నేతల బృందంతో కలిసి పేరేచర్ల జగనన్న కాలనీని సందర్శించిన ఆయన, నివాసయోగ్యంగా లేని ఆ గృహాల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...