వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని గౌడవీధిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో బుధవారం పోలీసులు దాడి చేశారు.
ఈ మేరకు ఒక ఇంటిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పట్టణ CI కె. నారాయణరావు తమ సిబ్బందితో దాడి చేసి నలుగురు పేకాట రాయుళ్లను, రూ.1 .64లక్షల నగదు , 4 ఫోన్లు, 2 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. పేకాట, బెట్టింగ్, పందేళ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

