వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కష్టంగా మారింది. జన్నారం అభయారణ్యం పరిధిలో ఉండటంతో ఎకోజోన్ అమలు అవుతోంది.
9 కి.మీ వరకు ఇసుక సేకరణను అటవీ అధికారులు నిలిపివేశారు. పేదలు ఇంటిని కట్టుకోవాలంటే కాలేశ్వరం, తదితర ప్రాంతాల నుండి లారీలలో రూ.45 వేలు చెల్లించి ఇసుకను తీసుకు వస్తున్నారు. కళ్లెదుటే గోదావరి ఉన్న ఇసుక తీసుకోలేని పరిస్థితి ఉందని నిరుపేదలు వాపోయారు.
Comments
Loading comments...

