వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై ఆమె ఆరా తీశారు. రౌతుపాలెం, చింతలూరు, శరభవరం, వెంకటనగరం తదితర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వినతిపత్రాల ద్వారా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆమె ఓర్పుగా విని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
Comments
Loading comments...

