వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 19న పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని 570కుపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో 18–35 ఏళ్ల వారు హాజరుకావచ్చు. అభ్యర్థులు naipunyam.ap.gov.inలో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

