వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని గంటస్తంభం నుంచి పెద్ద చెరువులోకి వెళ్లే ప్రధాన డ్రైనేజీ కాలువలో ఘన వ్యర్థాలను ఆటోమేటిక్ గా తొలగించేందుకు మెకానికల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
గురువారం కాలువను పరిశీలించిన ఆయన పనులపై అధికారులతో చర్చించారు. రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో కాలువలో పూడిక, చెత్త సమస్య తగ్గడంతో పాటు పెద్ద చెరువు కాలుష్యాన్ని నియంత్రించ వచ్చన్నారు.
Comments
Loading comments...

