వార్తలకు తిరిగి వెళ్లండి
స్మగ్లర్లకు పవన్ హెచ్చరిక

ఎర్రచందనం స్మగ్లింగ్కు సహకరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అటవీ విస్తీర్ణం పెంపుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, డ్రోన్లతో సీడ్ బాల్స్ పంపిణీ చేపడతామని చెప్పారు. కడపలో ఎర్రచందనం దుంగల స్వాధీనం, నిందితుల అరెస్టుపై వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...