Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగులపై అప్రమత్తతకు పవన్ ఆదేశం

Follow Udayam on Google
జయ Aug 16, 2026 5:07 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
ఏనుగులపై అప్రమత్తతకు పవన్ ఆదేశం - Udayam
చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ సమీప గ్రామాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏనుగుల కదలికలను డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో రాత్రివేళ గస్తీని మరింత పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...