వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్వేర్ అప్గ్రేడ్తో సర్వర్ డౌన్ కావడంతో మంగళవారం దేశవ్యాప్తంగా పాస్పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో ముందుగా స్లాట్లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాయంత్రానికి సమస్య కొలిక్కి వచ్చిందని అధికారులు తెలిపారు. మంగళవారం స్లాట్లు ఉన్నవారికి మరో తేదీలో ప్రత్యేక స్లాట్లు కేటాయించే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

